Chiranjeevi: నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి ఇస్తాను..!

-

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ 100 సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమం లో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడారు. అలానే ఎన్టీఆర్ ఏఎన్నార్ల గురించి కూడా మాట్లాడారు. నా బయోగ్రఫీ రాసుకునే సమయం నాకు లేదని, నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను అని అన్నారు.

సమకాలీన రచయితల్లో ఎండమూరికి సాటి లేరు ఆయన రాసిన అభిలాష సినిమాతో నా స్థానం పరిశ్రమలో పదిలం అయిందని ఫిక్స్ అయ్యాను అని చిరు అన్నారు. ఇప్పుడు నా బయోగ్రఫీ రాసె సమయం నాకు ఉండదు అందుకే ఎండమూరికి బాధ్యతను అప్పగిస్తున్నాను అని చిరంజీవి అన్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మా లాంటి వారికి దైవ సమానులు అని చిరు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news