సీఎం జగన్ ఫోటోకు బంగారు పూలతో అభిషేకం.. ఫోటోలు వైరల్

-

రెండు రోజుల కిందట పీఆర్సీ పై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్‌ ఉద్యోగుకు 23 ఫిట్‌ మెంట్‌ ప్రకటించడమే కాకుండా… ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయో పరిమితిని కూడా పెంచేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్‌ వయస్సును 62 సంవత్సరాలకు పెంచేశారు సీఎం జగన్‌.

ఇక సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కి పాలాభిషేకాలతో పాటు బంగారు పూల వర్షం కూడా కురిపిస్తున్నారు. అవును శ్రీకాళ హస్తిలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్ర పటానికి బంగారు పూలతో అభిషేకం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగులకు ఏ సీఎం  ఇవ్వని వరాలను ఇచ్చారని పేర్కొంటూ… బంగారు పూలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version