‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ దంపతులు

-

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడ రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం దంపతులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , భారతి హాజరయ్యారు. లిఫ్ట్ దగ్గరకు ఎదురు వచ్చి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆహ్వానం పలికారు. ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్ర రాజు హాజరయ్యారు.

ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ కార్యక్రమం ఇదే. విశాఖ పర్యటన నేపథ్యంలో విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version