కుప్పంవాసులకు శుభవార్త.. భారీగా నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

-

2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీల రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ మధ్యనే సీఎం జగన్ గ్రౌండ్‌ లెవల్‌ నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు.. నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ అయ్యి.. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని.. అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. ఈ క్రమంలో తాజాగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం మునిసిపాలిటీలోని 25 వార్డుల్లో పనులకు రూ. 66 కోట్లను ఆయన మంజూరు చేశారు.

ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వారం కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిదే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని అన్నారు. కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు భారీగా నిధులను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో కుప్పంపై ముఖ్యమంత్రి మరెన్ని వరాలు కురిపిస్తారో వేచి చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version