త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖ : సీఎం జగన్ సంచలన ప్రకటన

-

త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖ కాబోతుందని సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… త్వరలోనే విశాఖ…. ఏపీ కాపిటల్ కాబోతుందని సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని వివరించారు.

cm jagan

పారిశ్రామికవేత్తలను విశాఖకు ఆహ్వానిస్తున్నామని… ఏపీ 12% వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. విశాఖ లో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని ఏపీ సీఎం జగన్ వివరించారు.

కాగా, నిన్న ఏపీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్.. అత్యవసరంగా గండవరం ఎయిర్పోర్ట్ లోనే లాండింగ్ చేశారు. దీంతో ఏపీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version