ఈ నెల 21న బాపట్లకు సీఎం జగన్

-

ఈనెల 21న బాపట్ల జిల్లా చండూరు మండలం యడ్లపల్లి లో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం చండూరు మండలం ఎడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరగనున్న సీఎం సమావేశ సభ ఏర్పాట్లను మంత్రి మెరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం జగన్ స్థానిక ఏవిఆర్ జెడ్పి ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ తో పాటు విద్యార్థులు వినియోగించే బైజుస్ యాప్ ను ఆయన ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల మైదానంలోని సీఎం సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి మేరుగ నాగార్జున. అలాగే సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఈనెల 21వ తేదీ జగన్ జన్మదిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version