నేడు, రేపు కడప జిల్లాలో జగన్‌ పర్యటన.. షెడ్యూల్ ఇదే

-

అమరావతి : ఈ రోజు, రేపు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగానే రేపు డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్‌. ఇవాళ మధ్యాహ్నం 3.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలు దేరనున్నారు సీఎం జగన్‌. ఇక సాయంత్రం 4.20 నిముషాలకు ఇడుపులపాయ చేరుకుని అక్కడి వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేయనున్నారు.

ఇక రేపు అంటే ఆగస్టు 3 వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. అనంతరం 10.00 గంటలకు పులివెందుల లయోలా డిగ్రీ కాలేజ్‌ రోడ్‌లోని దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించనున్నారు ముఖ్యమంత్రి. తదనంతరం భాకరా పురం ఆడిటోరియం లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. దాని అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version