ఏపీలో మరో దారుణం..9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..!

-

తెలంగాణలోని హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఇటీవల చిన్నారి పై అత్యాచారం ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా ఏపీలో మరో చిన్నారి పై దారుణం జరిగింది. అనంతపురం జిల్లాలో తొమ్మిది ఏళ్ల చిన్నారిపై మానవమృగం అత్యాచారానికి పాల్పడింది. తమ కూతురికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు కొత్తచెరువు లోని ఆర్ఎంపి ఆదినారాయణ నిర్వహిస్తున్న షిరిడి సాయి క్లినిక్ కు తీసుకువెళ్లారు.

rape

అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న జయరామ్ అనే వ్యక్తి బాలికకు ఇంజక్షన్ ఇస్తానని చెప్పి తల్లిని బయటకు పంపించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాలికకు న్యాయం చేయాలని… నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన పై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version