విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు జగన్ ఆహ్వానం

-

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆహ్వానం పలుకుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరినీ సమ్మిట్‌కు హాజరు కావాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు చూడాలని పారిశ్రామికవేత్తలను కోరారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని.. త్వరలో కలుద్దామని పేర్కొన్నారు.

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు కు ముస్తాబైంది. మనదగ్గర ఉన్న వనరులు, ఏపీ శక్తిసామర్ధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కల్పిస్తున్న అవకాశాలను.. పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు ఏపీ అధికారులు. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు భారీగాహాజరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version