కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఉంది :నందిగం సురేష్‌

-

కూటమి అధికారంలోకి వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని.. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్‌లో అరాచకాలు జరుగుతున్నాయని నందిగాం సురేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని దారుణాలు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నాయి. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికే తాము అధికారంలోకి వచ్చినట్టుగా పరిస్థితి ఉంది.. వైసీపీ కంటే మంచి పాలన ఇస్తామని అందరినీ నమ్మించారు అని విమర్శించారు. నిజమేనేమో అని ఓట్లేస్తే జరుగుతున్నది దారుణంగా ఉంది. కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా ప్రభుత్వం ఉంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువూరులో ఎమ్మెల్యే చేసిన అరాచకాన్ని ఏం అనాలి?. వైసీపీ నేత అక్రమంగా బిల్డింగ్ కడితే అధికారులు చర్యలు తీసుకుంటారు.. కానీ ఎమ్మెల్యే కొలకపూడి బుల్డోజర్ తీసుకుని బిల్డింగ్‌లను పడేయటం ఏంటి?. పెన్షన్ల పంపిణీలో కూడా లంచాలు తీసుకున్నారు అని విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. వైసీపీ వారి అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉంది” అని సురేష్‌ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version