సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్ రెడ్డి రిప్లై

-

ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు మంగళవారం రిటర్న్ లేఖ రాశారు.10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై ముఖాముఖీ చర్చిద్దామన్న చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో భేటీకి ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొ్న్నారు. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖీ చర్చలు అవసరం. చర్చలే పరస్పర సహకారానికి గట్టి పునాది వేస్తాయి. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన అరుదైన నేత చంద్రబాబు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కాగా, విభజన అంశాలపపై ఫేస్ టూ ఫేస్ భేటీ అయ్యి చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు లేఖకు రేవంత్ రిప్లై ఇచ్చారు. భేటీకి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో.. ఈ నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. రేవంత్, చంద్రబాబు భేటీపై 2 తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version