కాంగ్రెస్ ను బలహీన పరిచేందుకు మోదీ, మమతా ఒకటయ్యారు.- అధిర్ రంజన్ చౌదరి.

-

యూపీఏ ఎక్కడుందనే మమతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి తోడు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్థాయి స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించారు. మోదీ, మమతా ఒకే పాట పాడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు అంటూ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ తన పార్టీని తన ప్రయోజనాలను, అల్లుడ అభిషేక్ బెనర్జీని కాపాడుకోవడాని బీజేపీతో  లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శలు చేశారు. మమతా బెనర్జీ బీజేపీ మధ్య బంధం పాతదే అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించారు. దేశంలో కాంగ్రెస్ లేనిదే బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version