దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు బిజీగా ఉన్నాయి: మోడీ

-

పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు దేశ ప్రజలను భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.ఆ 2 పార్టీలు పాక్‌కు సానుభూతిపరులు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన కాంగ్రెస్‌, ఎస్పీ ఓటమి చవిచూశాయని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ అవి కలిసి ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని మోడీ ఎద్దేవా చేశారు. ”ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో మనల్ని బెదిరించినవారు ప్రస్తుతం ఆహార ధాన్యాల కోసం అల్లాడుతున్నారు అని అన్నారు. పాకిస్థాన్‌ పని అయిపోయింది. కానీ, ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్‌లు మాత్రం దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి” అని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.పాక్‌ వద్ద అణు బాంబులున్నాయని మనం భయపడాలని వారు అంటున్నారు. ఈ 56 అంగుళాల ఛాతీ గురించి వారికి తెలియదా? అంటూ మోడీ తన చాతిని చూపిస్తూ అన్నారు. ఇది వారి బలహీన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. బలమైన మోదీ సర్కార్‌. మనల్ని బెదిరించాలని ప్రయత్నించే వారిని ఇండియా వదిలిపెట్టదు. వారి దేశంలోకి వెళ్లి మరీ వాళ్ల అంతు చూసింది అని వార్నింగ్ ఇచ్చారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version