తెల్ల దొరల పాలన కన్నా..దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది : కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు.నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు.నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన  నయవంచక సర్కారు ఇది.ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ?తెల్ల దొరల పాలన కన్నా..దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది అని విమర్శించారు.

 

ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా ?రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా ??ఇది ప్రజా పాలన కాదు..ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని ధ్వజమెత్తారు. ప్రచారంలో ఒక మాట..ప్రభుత్వంలోకి వచ్చాక.. మరో మాట మాట్లాడుతున్న  సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయింది.అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో..జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో..అట్టర్ ఫ్లాప్ అయినందుకు.. వెంటనే నిరుద్యోగులకు.. కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version