మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ… చర్చించే అంశాలు ఇవే..!

-

రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 16వ తేదీన మరోసారి సమావేశం కానుంది. రైతుల నుంచి ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాలో అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం నిర్ణయించింది.రోజుకు మూడు సమావేశాలు చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ భేటీ కానుంది. 5 ఎకరాల కటాప్ పెట్టాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నారు. 92 శాతం చిన్న, సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారని మంత్రివర్గానికి అధికారుల నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో రైతు బంధు, నిధుల విడుదలలో రూ. 26 వేల కోట్లు దుర్వినియోగానికి గురి అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు సబ్ కమిటీకి నివేదిక అందజేశారు. ఇప్పటికే రైతు నివేదికల ద్వారా తీసుకున్న రైతుల అభిప్రాయాన్ని సబ్ కమిటీ ముందు అధికారులు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version