హైదరాబాద్‌లో కరోనాతో కాంగ్రెస్‌ నేత మృతి!

-

కరోనా వైరస్ తో ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనాకు ఎవరు అతీతం కాదు. చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేదు.. సీఎం అయినా పీఎం అయినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటే కరోనా భారిన పడుతారు.

congress-leader-narendra-yadav-died-off-corona-virus

ఇంకా ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత జి. నరేంద్ర యాదవ్‌ కరోనా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ నేపథ్యంలోనే యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్నా అయన ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనకు వైరస్‌ సోకినట్లు సమాచారం.

కాగా ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ నరేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాగా నరేంద్ర యాదవ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version