గంగం గణేశా సినిమా నిర్మాత కేదార్‌ మృతి..!

-

గంగం గణేశా సినిమా నిర్మాత అయినటువంటి కేదార్‌ సెలగంశెట్టి మృతి చెందారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నా ఆయన అక్కడే మృతి చెందారు. అయితే కేదార్.. గత కొంతకాలంగా అస్వస్థత తో బాధపడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. కానీ ఆయన మరణానికి కారణం సరిగా ఏంటి అనేది ఇంకా తెలియదు. అయితే కొంతకాలం నుంచి దుబాయ్ లో నివాసం ఉంటున్న కేదార్ కు.. ఒక కూతురు కూడా ఉంది.

అయితే కేదార్‌ నిర్మించిన గంగం గణేశా సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా.. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన గత సంవత్సరం విడుదల అయిన రాజు యాదవ్ అనే సినిమాను కూడా ప్రజల ముందుకు తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version