బిజెపి నాయకులను చంపే కుట్ర చేస్తున్నారు – బండి సంజయ్

-

బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని తెలిపారు.రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.కేసీఆర్, ఆయన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రిపుల్ ఐటీలో కనీసం మీడియాను కూడా అనుమతించడం లేదని అన్నారు.

బండి సంజయ్

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలైనా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.భోజనం వండేందుకు కనీసం షెడ్లు కూడా సరిగ్గా లేవని..కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలను కాపాడుకునే తెలివి కేసీఆర్ కి లేదని మండిపడ్డారు బండి సంజయ్.ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ కుటుంబం మొత్తం ఎక్కడ పోయిందని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.సోయం బాపురావు ఆధ్వర్యంలో సమస్యలు పరిశీలించేందుకు వర్సిటీకి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

ఆయన స్థానిక ఎంపీ.. ఆయన్ను కూడా పంపించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీకి తెలంగాణ ప్రజల కోసం వెళ్ళావా.. నీ సొంత పనులకు పోయావా? అంటూ ప్రశ్నించారు.పోలీసులు బీజేపీ నాయకుల కాళ్లపై నుంచి కార్లు ఎక్కిస్తున్నారని,బీజేపీ నాయకులను చంపే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు బండి సంజయ్.పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మరోసారి భైంసా ఘటన రిపీట్ చేయాలని చూస్తున్నారని అన్నారు.సోయం బాపురావును పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ కి చేతకాకుంటే వర్సిటీని మాకు అప్పగించాలని.. మేము సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version