కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

-

కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం నియోజకవర్గంలో కార్యకర్తలు, పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడే క్రమంలో.. ‘కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు.

పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది.రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ ఉంటే కుదరడం లేదని దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news