తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి జరిగింది. మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి జరిగింది. ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి.

ఇక ఈ సంఘటన పై ఆర్టీసీ ఉన్నతాధికారుకు దృష్టికి డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తీసుకువెళ్లారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసింది బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆర్టీసీ డ్రైవర్, యూనియన్ నాయకులు. మరి ఈ సంఘంటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి
మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి ఉండగా జరిగిన ఘటన
అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి
ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సీసీటీవీ కెమెరాల్లో… pic.twitter.com/WevAB2sj3h
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2025