కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమినరీ కీ విడుదల

-

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇవాళ ఉదయం ప్రాథమిక పరీక్ష జరగ్గా.. APSLPRB ప్రిలిమినరీ కీలను విడుదల చేసింది. ఈ కీలపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు mail-slprb@ap.gov.inకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 4 సెట్ల బుక్లెట్లను APSLPRB వెబ్సైటులో పెట్టింది. కీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.

కేవలం హాల్ టికెట్, పెన్ను మాత్రమే పరీక్షకు అభ్యర్థులకు అధికారులు అనుమతినిచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు పోలీసు నియామక మండలి అనుమతిని నిరాకరించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మొత్తం 5.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పరీక్ష కోసం 997 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version