నిఖిల్ కు బదులు నితిన్ ను పిలిచారట… బిజెపిపై సెటైర్లు

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. బీజేపీ దృష్టి ఇప్పుడు తెలంగాణపై పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ రాజకీయం తెలంగాణ చుట్టూ తిరిగుతోంది. అయితే నిన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశమయ్యారు.

బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన జేపీ న‌డ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో బ‌స చేయ‌గా.. బీజేపీ ఆహ్వానం మేర‌కు హోట‌ల్‌కు వెళ్లిన నితిన్… న‌డ్డాతో స‌మావేశ‌మయ్యారు.

అయితే ఈ సమావేశంపై తాజాగా ట్రోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి కార్తికేయ 2 సినిమాతో సక్సెస్ లో ఉన్న నిఖిల్ తో బిజెపి చీఫ్ నడ్డా భేటీ కావాల్సి ఉంది. కానీ సమాచార లోపమో… లేక.. నితిన్ మరియు నిఖిల్ ఫేస్ కట్ ఒకే రకంగా ఉండడంతో ఈ మిస్టేక్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ తప్పిదాన్ని గుర్తించిన బిజెపి అధిష్టానం… త్వరలోనే నిఖిల్ తో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుందట. దీంతో ఈ విషయం.. వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బిజెపిపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version