బాలీవుడ్ లో కరోనా కలకలం… కరీనాకపూర్ కు కోవిడ్ పాజిటివ్..

-

కోవిడ్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ పరిశ్రమల్లో మళ్లీ కరోనా కలకలం మొదలవుతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా బాలీవుడ్ భారీగా నష్టపోయింది. మహారాష్ట్రలో చాలా ఎక్కువగా కరోనా తీవ్రత ఉండటంతో ఇటు షూటింగులకు, అటు థియేటర్లకు అనుమతి నిరాకరించింది మహా సర్కారు.

తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కోవిడ్ బారిన పడింది. కరీనాతో పాటు అమృతా అరోరాకు కూడా కరోనా పాజిటివ్ కరోనా సోకింది. ఇటీవల కరీనా కపూర్ చాలా పార్టీలకు అటెండ్ అయింది. కరోనా  నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు అటెండ్ కావడం పట్ల బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సీరియస్ అయింది. కరీనాతో టచ్ లో ఉన్నవాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, సన్నిహితంగా ఉన్నవారు క్వారంటైన్ అవ్వాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version