ఏపీలో కొత్త‌గా 108 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం

-

ఏపీలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. నిన్న‌టి కంటే ఇవాళ కాస్త త‌గ్గాయి క‌రోనా కేసులు. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2074976 కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒక మ‌ర‌ణం సంభ‌వించింది.

ap carona

క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14467 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1878 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 141 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2058631 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 21, 010 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,07,98,406 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో 2 ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట ప‌డ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version