దేశంలో కరోనా విలయం, వరుసగా 5 వ రోజు 50 వేల కేసులు

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా మరోసారి 52 వేల మందికి పైగా గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటాయి. వరుసగా అయిదవ రోజు 50 వేల కేసులు దాటింది కరోనా మహమ్మారి. దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య చూస్తే… 18, 03, 696 కు చేరుకుంది.

corona

గడచిన 24 గంటల్లో 52, 972 కేసులు నమోదు అయ్యాయి అని, 771 మంది ప్రాణాలు కోల్పోయారు. 5, 79, 537 యాక్టివ్ కేసులు ఉన్నాయి దేశంలో. ఇప్పటి వరకు కరోనా నుంచి 11, 86, 203 మంది కోలుకుని బయటపడగా… దేశ వ్యాప్తంగా 38 వేల 136 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా పరిక్షలు రెండు కోట్లు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు 2 కోట్ల 2 లక్షల పరిక్షలు చేసామని కేంద్రం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version