అంతర్వేది రధం బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం

-

అంతర్వేది రధం దగ్ధం ఘటన బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం రేగింది. ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ నయీమ్ అద్నాన్ హస్మి సహా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఐదుగురు ఎస్సైలు సహా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని అందరినీ క్వారంటైన్ కు తరలించారు.

ధార్మిక సంఘాల ఆందోళన చేస్తున్న సమయంలో రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి సహా ఐదుగురు ఎస్సైలు విధులు నిర్వహించారు. పోలీసు సిబ్బంది, ధార్మిక సంఘాల ప్రతినిధుల మద్య జరిగిన తోపులాటలో ఈ సిఐ, ఎస్సైలు పలువురు సిబ్బంది ఉన్నారు. బహుశా ఆ ధార్మిక సంఘాల ప్రతినిధులలో ఎవరి ద్వారా అయినా సంక్రమించి ఉండచ్చని భావిస్తున్నారు. అంతర్వేది ఘటన పై ఎపి పోలీస్ విచారణ జరుగుతుందని డీజీపీ తెలిపారు. ఇప్పటికే చాలా మెటీరియల్ ఎవిడెన్స్ సేకరించామని ఆయన అన్నారు. మంట ఎలా వచ్చింది.. ఎక్కడ ఎక్కువుగా కాలింది.. అనే కోణాల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version