షాకింగ్ : నోరు శుభ్రంగా ఉంటే కరోనా రాదట

-

దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కరోనా టెన్షన్ నెలకొని ఉంది..అయితే తాజాగా ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం నోరు శుభ్రంగా ఉంటే కరోనా సోకే అవకాశం తక్కువ అని తేలింది. అయితే చిగుళ్ల వ్యాధులు ఉన్నవారిలో మాత్రం బయటి నుంచి నోట్లోకి చేరిన వైరస్ లాలా జలం నుంచి రక్తప్రవాహం లోకి వెళ్ళి అక్కడి నుండి ఊపిరి తిత్తుల లోకి వెళుతుందని గుర్తించారు.

Mouthwash

వాయునాళాలతో పోలిస్తే ఈ మార్గం ద్వారా నే ఎక్కువగా వైరస్ ఊపిరి తిత్తుల లోకి వెళుతుందని గుర్తించారు. అందుకే మౌత్ వాష్ లు ఇతర వాష్ లతో ఎప్పటికప్పుడు నోరు శుభ్రంగా కడుక్కోవాలి. నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఉప్పు నీటితో పుక్కిలిస్తే కరోనా సోకే అవకాశం తక్కువ అని ఈ అధ్యయనంలో తేలింది. సో ఇంకెందుకు ఆలస్యం నోరు శుభ్రం చేసుకునే పనిలో ఉండండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version