తెలుగు రాష్ట్రలో కరోనా విజృంభణ..! ఎంత మంది మరణించారో తెలుసా..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 4,944 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 1,232 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 62 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 25,574 మంది డిశ్చార్జి కాగా.. 758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే తెలంగాణలో మంగళవారం కొత్తగా 1,430 కరోనా కేసులు నమోదవ్వగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కి చేరింది. 429 మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 36,385 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,891 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version