బిగ్ బ్రేకింగ్; ఏపీలో కరోనా రికార్డ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కరోనా కేసులు 81 నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 1097 కి చేరుకుంది. తాజాగా హెల్త్ బులిటెన్ ని ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటి వరకు కరోనా తో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నేడు నమోదు అయ్యాయి.

కర్నూలు జిల్లాలో 4 కేసులు, గుంటూరు 3 కేసులు, తూర్పుగోదావరి 2 కేసులు, అనంతపురం 2 కేసులు, కడప జిల్లాలో 3 కేసులు, ప్రకాశం 3, కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. కరోనా ఏపీలో మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఒక్కసారిగా ఏ జిల్లాలో కూడా 50 కేసులకు పైన నమోదు కాలేదు. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version