ఫ్రెండ్ పుట్టిన రోజున కార్ రేస్..చివరికి..!

-

అతివేగం ప్రమాదకరం అని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది పాటిస్తే మరికొంతమంది మాత్రం లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చేసుకుంది. స్నేహితురాలి పుట్టిన రోజుకు వెళ్లిన ఓ యువతి అతివేగం వల్ల ప్రాణం పోగొట్టుకుంది. ఈ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది. మండ్య జిల్లా నాగమంగళ తాలూకాలోని కొననూరు గేట్ దగ్గర ఆదివారం ఉద్యమం కారు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు బాగలకుంటెకు చెందిన మంజుల దేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తను శ్రీ మైసూరు లో బిబి ఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

తనుశ్రీ స్నేహితురాలు పుట్టినరోజు ఉండటం తో ఆదివారం ఉదయం 7:30 నిమిషాల ప్రాంతంలో సొంత కారుతో డ్రైవింగ్ చేసుకుంటూ మైసూరు బయలుదేరింది. మధ్య స్నేహితురాళ్ళు మరో కారులో వచ్చారు. వీరు వెళుతున్న సమయంలో ఒకరికంటే మరొకరు వేగంగా వెళుతూ పోటీ పెట్టుకున్నారు. కాగా తాను శ్రీ కారు కోననూరు వద్ద అదుపుతప్పి గోడ ను ఢీ కొట్టి 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తను శ్రీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్ను మూసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version