తెలంగాణలో దారుణం..ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించి..చివరకు !

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కు గురయ్యాడు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో బీటెక్ చదువుతున్న నవీన్ ను హత్య చేసింది ఇంటర్ క్లాస్ మెట్ హరిహర కృష్ణ గా గుర్తించారు పోలీసులు. ఈ నెల 17 న నలగొండ లో అదృశ్యం అయిన నవీన్ ..మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు పోలీసులు.

అయితే, నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చారు పోలీసులు. నవీన్, హరిహర కృష్ణ లు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారట. ఇంటర్ క్లాస్ మెట్ అయిన అమ్మాయిని..దక్కించుకునేందుకు నవీన్ ను హత్య చేశాడు హరిహర కృష్ణ. నల్గొండ లో వున్న నవీన్ ను…గేట్ టూ గేదర్ పార్టీ వుందని నమ్మించి.. అబ్దుల్లాపూర్ మెట్ కు రప్పించాడు నిందితుడు హరిహర కృష్ణ.

 

ఈ తరుణంలోనే, నవీన్ ను హత్య చేసి … గుట్టల ప్రాంతం లో పడేశాడు నిందితుడు హరిహరకృష్ణ. నవీన్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. మృతుడు నవీన్ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం లోని గైరాన్ తండా కు చెందిన వాడు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version