రాజస్థాన్ భరత్ పూర్ లో దారుణం.. భూ వివాదంలో తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించిన అన్న

-

ప్రస్తుతం రోజు రోజుకు కాలం మారిపోతుంది. తోడు, నీడగా కలిసి మెలిసి ఉండాలనుకునే వారు కసాయిల్లాగా మారిపోతున్నారు. ఆప్యాయలతో ఉండే అన్నదమ్ముల బంధానికి స్వస్తీ చెబుతున్నారు. స్వస్తీ చెబితే సరే కానీ.. పగలు, ప్రతీకారాలు పెంచుకొని ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. మరికొందరూ అయితే వాహనాలతో తొక్కి తొక్కి చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్ భరత్ పూర్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.

భూమి కోసం ట్రాక్టర్ తో తమ్ముడిని చంపేశాడు. ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు.. ఏకంగా 8 సార్లు తొక్కించాడు వరుసకు అన్న అయ్యే వ్యక్తి. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజుల నుంచి భూ వివాదం జరుగుతోంది. ఇవాళ ఉదయం సమయంలో కూడా గొడవ జరిగింది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అనంతరం వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని అన్న ఈ భూవివాదంలో ట్రాక్టర్ తో తొక్కించాడు. ఏకంగా ఎనిమిది సార్లు ట్రాక్టర్ ని తన శరీరం మీదుగా తీసుకెళ్లడంతో.. అతని శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది. స్థానికులు ఎంత చెప్పిన వినకుండా రివర్స్ లో, స్ట్రెయిట్ గా ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ కేసులో మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version