మునుగోడుతో పాటు గజ్వేల్ లో పోటీ చేస్తాను : రాజగోపాల్ రెడ్డి

-

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఎల్లుండి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ను ఓడించాలనేదే తన ధ్యేయమని.. అందుకోసమే బీజేపీ లోకి వెళ్లినట్టు తెలిపారు. కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీతో సాధ్యం కాదని.. బీఆర్ఎస్ ప్రత్యామ్నయం కాంగ్రెస్ అనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

తాజాగా కాంగ్రెస్ హై కమాండ్ కి రాజగోపాల్ రెడ్డి ఓ ప్రతిపాదనను పంపారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తానని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చకు పెడతానని కేసీ వేణుగోపాల్ రాజగోపాల్ రెడ్డికి సూచించారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version