రోడ్డుమీద వెళ్తున్న జనంపై నుంచి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం

-

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

గుజరాత్ అరావళ్లి జిల్లా అంబాజీలో శుక్రవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి రహదారిపై ఉన్న వారిని ఢీకొట్టింది. కొందరు గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడినుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద ప్రాంతంలో ఉన్న సీసీకెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version