భార్య, పిల్లలని సుత్తితో చంపి, చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు…!

-

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని సుత్తితో భార్యా, పిల్లలను ఇద్దరినీ చంపేసాడు ఒక కానిస్టేబుల్. ఈ ఆశ్చర్యకర ఘటన ఝార్ఖండ్ లోని రాంచిలో జరిగింది. వివరాల్లోకి వెళితే అతని భార్యా కొంత కాలంగా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన కానిస్టేబుల్ బ్రిజేష్ తివారి భార్యను పలు మార్లు హెచ్చరించాడు. ఇద్దరికీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా సరే భార్య తీరు మారలేదు.

దీనితో భార్యను చంపాలి అనుకున్న తివారి… ఆమెను సుత్తితో మోది, ఆ తర్వాత కత్తితో హత్య చేసాడు. ఆ తర్వాత అతని కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను చంపి ఆ తర్వాత తాను కూడా విషం తీసుకున్నాడు. నిందితుడు కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితుడు తన భార్య మరియు ఇద్దరు పిల్లలను చంపిన తరువాత, రాంచీలోని పండారాలో నివసిస్తున్న తన సోదరికి ఫోన్ చేసి, “నేను ముగ్గురిని చంపాను” అని చెప్పాడు. వెంటనే కానిస్టేబుల్ సోదరి తమ కుటుంబంతో కలిసి అక్కడికి చేరుకొని వాళ్ళు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానికి చెప్పగా తాము ఎప్పుడూ వాళ్ళు గొడవ పడటం చూడలేదని, అసలు ఈ ఘటన తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news