బంగారం విషయంలో వివాదం.. పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి మ‌రీ..

-

ప్ర‌స్తుత స‌మాజంలో మానవత్వం కొరవడుతోంది. గుంటూరు జిల్లా కొత్తపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డేగల సుబ్బమ్మ (55) చెల్లెలి కుమారుడు పగడం రాజశేఖరరెడ్డి మోరవాగుపాలెంలో నివసిస్తున్నాడు. గతంలో ..తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి పెద్దమ్మ సుబ్బమ్మకు చెప్పగా, ఆమె తన వద్ద ఉన్న 16 సవర్ల బంగారు నగలు ఇచ్చి రాజశేఖర్ రెడ్డికి సహాయం చేసింది. అవి బ్యాంకులో తనఖా పెట్టి రాజశేఖర్ రెడ్డి డబ్బు వాడుకున్నాడు. ఇక తన అవసరాలను తీర్చుకున్న రాజశేఖర్ ఇటీవల బ్యాంకు నుంచి నగలు విడిపించాడు.

విషయం తెలిసిన ఆమె శనివారం తన ఇంటి ముందు నుంచి ట్రాక్టర్‌పై వెళ్తున్న రాజశేఖర్‌ను అడ్డుకుని తన నగలు ఇవ్వాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తన నగలు ఇచ్చే వరకు ట్రాక్టర్ ముందు నుంచి కదిలేది లేదని భీష్మించుకున్న సుబ్బమ్మ ట్రాక్టర్ ఎదురుగా నిల్చుంది. పెద్దమ్మ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజశేఖర్ ట్రాక్టర్‌తో ఆమెను తొక్కించి చంపేశాడు. అనంతరం ట్రాక్టర్ దిగి పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version