IPL 2023 : రేపు ఐపిఎల్ 2023 ఫైనల్.. చెన్నై కప్ కొడుతుందా ?

-

ఐపీఎల్ 2023 టోర్నీకి కౌంట్ డౌన్ షురూ అయింది. ఆదివారం అంటే రేపు.. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభమయి ఈ మ్యాచ్ కోసం వేలాది సంఖ్యలో ప్రేక్షకులు వస్తున్నారు.

ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందోనని దానిపై అటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2023 విజేతగా నిలిస్తే…. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక అటు గుజరాత్ జట్టు కూడా మంచి ఫామ్ లో ఉంది. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ దారుణంగా ఆడుతున్నాడు. బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా విరుచుకుపడుతున్నాడు గిల్. మరి ఫైనల్ మ్యాచ్లో గిల్ కు గాలం వేసి.. చెన్నై ఛాంపియన్స్ గా చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version