ఢిల్లీ ఆల్ అవుట్… ముంబై ముందు ఛాలెంజింగ్ టార్గెట్ !

-

రోహిత్ శర్మ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్ లో అయినా గెలవాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు టాస్ గెలిచిన రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బదులుగా ఢిల్లీ నిర్ణీత ఓవర్ లలో 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అయితే 10 ఓవర్ల అనంతరం ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి కనీసం 150 స్కోర్ అయినా చేస్తుందా అనిపించింది. కానీ అక్షర్ పటేల్ చేసిన ఫిఫ్టీ వలన ఈ మాత్రం స్కోర్ అయినా చేసింది. ఇక వార్నర్ మొదటి నుండి ఆచితూచి ఆడుతూ టీం స్కోర్ లో కీలకం అయ్యాడు.

ఈ పిచ్ మీద ఈ మాత్రం స్కోర్ ను ముంబై ఛేదిస్తుందా ? కాగా ఈ సీజన్ లో ముంబై కు ఛేజింగ్ రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ముంబై ఓపెనర్లు చక్కని ఆరంభాన్ని ఇస్తే ఈ స్కోర్ ను ఛేదించడం ఏమంత కష్టం కాదు. మరి ఏమి జరుగుతుందో తెలియాలి అంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version