బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేయాలని చూస్తోంది…. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

-

ఢిల్లి డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై జరిగిన దాడి ఆయనను హత్య చేసేందుకు బీజేపీ వేసుకున్న ముందస్తు పథకం అని ఆయన ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ విజయం బీజేపీ ఓటమి కారణంగానే బీజేపీ అరవింద్ కేజ్రీవా్ ను హత్య చేయాలనుకుంటోందని ఆరోపించారు. ఈరోజు బీజేపీ గుండాలు సీఎం నివాసంలోని సీసీ కెమెరాలు, బారికేడ్ లను బద్దలు కొట్టారని విమర్శించారు. దాడిని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించలేదని సిసోడియా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనతో సంబంధం ఉన్న 70 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

ఇటీవల ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కాస్త విధ్వంసానికి దారి తీసింది. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినట్టే‘ ది కాశ్మీర్ ఫైల్స్’కు ఢిల్లీ కూడా టాక్స్ ఫ్రీ ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను బీజేపీ ప్రమోట్ చేస్తుందని విమర్శించారు. సినిమాను ఫ్రీగా చూడాలనుకుంటే యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలంటూ వ్యాఖ్యలు చేశాు.

Read more RELATED
Recommended to you

Exit mobile version