కుదేలైన ఢిల్లీ : రప్పాడిస్తున్న గుజరాత్ బౌలర్లు… 150 అయినా చేస్తారా?

-

టాస్ ఓడిన ఢిల్లీ టీం బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అవుతోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు కూడా చేతులెత్తేయడంతో ఢిల్లీ తీవ్ర కష్టాల్లో ఉంది. కెప్టెన్ వార్నర్ ఒక్కడే కాసేపు నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత వార్నర్ సైతం 37 పరుగుల వద్ద ఉండగా అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక యువ ఆటగాడు పృథ్వీ షా మరోసారి కేవలం 7 పరుగులే చేసి షమీ బౌలింగ్ లో జోసెఫ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ నాలుగు పరుగులకే షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా స్టార్ రోసౌ కూడా డక్ అవుట్ గా వెనుతిరిగాడు.

ఇలా స్టార్ ఆటగాళ్లంతా 10 ఓవర్ లలోపే పెవిలియన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ మరియు అభిషేక్ పారెల్ లు ఉన్నారు. వీరిద్దరూ నిదానంగా ఆడుతూ ఒక పార్టనర్ షిప్ ను నెలకొల్పితే కనీసం 150 చేయగలుగుతుంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version