‘శాకుంతలం’ .. ట్రైలర్ వచ్చేస్తోంది..!

-

‘శాకుంతలం’ సినిమా త్వరలోనే వెండితెర పైకి రాబోతుంది. ‘శకుంతల’గా సమంతను చూడటానికి ఆమె అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత గుణశేఖర్ నుంచి వస్తుండటంతో, ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడేవారు కూడా ఈ సినిమా కోసం వేచి చుస్తున్నారు. ఈ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలను పెంచనున్నారు. ఇప్పటికే ఇది ఒక దృశ్య కావ్యమనీ .. విజువల్ వండర్ అనే విషయంపై అందరిలోను ఒక స్పష్టత వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో డిఆర్పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version