మళ్లీ ఓడిన హైదరాబాద్‌.. ఢిల్లీ ఘన విజయం

-

ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 92 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 67 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. నికోలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు. ఖలీల్‌ అహ్మద్‌ 3, శార్దుల్‌ 2 వికెట్లు తీశారు.

ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగితే హైదరాబాద్‌ ఖాతా (వికెట్‌) తెరిచింది. భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌ వికెట్‌గా తీశాడు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా ఢిల్లీ పుంజుకుంది. ఈ లీగ్‌లోనే ‘స్పీడ్‌స్టర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌ను తొలి ఓవర్‌ నుంచే ఉతికేశారు. 4వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో వార్నర్‌ 21 పరుగులు పిండుకున్నాడు. మార్‌‡్ష (10) అవుటైనా… కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), వార్నర్‌ ఇద్దరు ఇన్నింగ్స్‌ను మెరుపులతో దారిలో పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version