మహిళ సమాధానానికి ఖంగుతిన్న మంత్రి ధర్మాన

-

జగన్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న సురక్ష. అయితే.. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును ఖంగితినేలా చేసింది ఓ మహిళ.. శ్రీకాకుళం నియోజకవర్గం ఎల్‌బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గూనపాలెంకు చెందిన వై.ఆదిలక్ష్మికి ధృవపత్రాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు అందజేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీకి ఓటేస్తావు..మన పార్టీ ఏమిటి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సదరు మహిళ ఆదిలక్ష్మిని అడిగారు. దీంతో ఆ మహిళ టక్కున సైకిల్‌కు వేస్తా..మన గుర్తు సైకిల్ అని తెలిపింది. ఆ మహిళ సమాధానంతో మంత్రి ధర్మానతోపాటు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ మహిళ తర్వాత నాలుక్కరచుకుని ఫ్యాన్ అని చెప్పింది.

అయితే ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. కానీ గోతిలో పడిపోతారు జాగ్రత్త అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. మరో 8 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు నాయుడు అమలుకు నోచుకోలేని దొంగ హామీలు ఇస్తారని ఆరోపించారు. ఆ మాయలో పడొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసులో చిన్నవాడైనా అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version