నల్గొండ జిల్లాలో బయటపడుతున్న వజ్రాలు, రైతుకి ఏం దొరికింది…?

-

నల్లగొండ జిల్లాలో వజ్రాలు ఇప్పుడు ఆసక్తికరం అయ్యాయి. గత నల్గొండ ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల ఆవులపల్లిలో ఓ రైతు పొలంలో బయట పడింది ఒక వజ్రపు రాయి. సాగు నీటి కోసం తవ్విన బావిలోఈ వజ్రం బయటపడింది. అనుమానంతో హైదరాబాద్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో వజ్రంగా గుర్తించారు. గతంలో జిల్లాలోని కృష్ణా, మూసీ పరివాహక ప్రాంతాలలో వజ్రాలు దొరికాయి.

దీనితో పరిక్షలు కూడా నిర్వహించారు. రామడుగు, చండూరు, గుర్రంపోడు, ఉట్లపల్లి, పెదవాగు, డిండి, హాలియా వాగు ప్రాంతాల్లో భూగర్భంలో వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించి జీఎస్ఐ, ఓయూ భౌతిక శాస్త్రం విభాగం సర్వే చేసింది. నల్గొండ జిల్లాలో13 జోన్లలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఏపీలో కర్నూలు జిల్లాలో తొలకరిలో వజ్రాలు దొరికాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version