పరశురామ్ పాన్ ఇండియా స్కెచ్ మరో లెవల్లో..!!

-

సర్కారు వారి పాట విడుదలై ఏడు నెలలు గడుస్తున్నా.. చై పరుశురాంల సినిమా సెట్ కాలేదు. పరశురామ్ తర్వాత సినిమా అక్కినేని నాగచైతన్య తో చేయవలసి ఉంది. దీంతో అందరూ ఈ సినిమా ఆగిపోయిందనే అనుకుంటున్నారు.అయితే డైరెక్టర్ పరుశురాం నాగ చైతన్య కోసం రాసిన  కథ హీరోకు నచ్చలేదని తెలుస్తోంది.స్క్రిప్టు విషయం పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోవడంతో.. నాగ చైతన్య సినిమా నుంచి తప్పుకున్నారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. 

దీనితో పరశురామ్ మళ్లీ తాను గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జంట అయిన విజయ్ దేవరకొండ మరియు రాష్మిక మందన్న తో సినిమా చేయాలనే ఆలోచన తో ఉన్నాడట. మళ్లీ గీత గోవిందం  కు సీక్వెల్ చేయాలనే కోరిక తో ఉన్నారట. దానికి ప్రాథమికంగా హీరో, హీరోయిన్స్ అనుమతి తీసుకున్నారని ముందుగా లైన్ చెప్పి ఒకే చేయించు కున్నారని అంటున్నారు.

కథను పాన్ ఇండియా లెవల్లో  విజయ్ దేవరకొండ ఇమేజ్ కి తగినట్టు మార్చి ఈ సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. తనకు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు పరశురాం మీద నమ్మకంతోనే విజయ్ ఈ సినిమా ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను నభూతో నభవిష్యతి అన్న విదంగా తయారు చేసి విజయ్, రశ్మిక ల పాన్ ఇండియా ఇమేజ్ వాడుకొని పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని ప్రయత్నంలో పరశురామ్ ఉన్నారట.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version