డీకే శివకుమార్: బీజేపీ ఓటమి… కర్ణాటక ప్రజల గెలుపు

-

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ మరియు ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ సెమిట్మెంటల్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాన్ని ఉద్దేశించి మాట్లాడిన శివ కుమార్ కర్ణాటక ప్రజలకు ధన్యవాదములు తెలుపుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సాధించిన గెలుపు.. నాదో లేదా సిద్దరామయ్య గారిదో కాదు కర్ణాటక ప్రజలది అని అయన పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుండి కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది అని డీకే శివ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు మాపై మరియు మా పార్టీపై పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. కాగా ఇప్పుడు కర్ణాటకకు సీఎం ఎవరు కానున్నారు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సీఎం అయ్యే వారిలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్న వారిలో మాజీ సీఎం సిద్దరామయ్య మరియు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. రేపు సాయంత్రం 5 .30 గంటలకు జరగనున్న సీఎల్పీ మీటింగ్ లో సీఎం ఎవరన్నది తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version