లాక్ డౌన్ లో కోహ్లీ తన భార్య కోసం ఏమి తయారు చేశాడో తెలుసా..?

-

కరోనాతో ఇంటికే పరిమితమైన టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ.. ఆఫ్​ ఫీల్డ్​ నైపుణ్యాలను పెంచుకుంటున్నాడు. తన సతీమణి, హీరోయిన్​ అనుష్క శర్మతో గడిపిన ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే తాజాగా మయాంక్​ అగర్వాల్​తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.లాక్​డౌన్​లో తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం స్వయంగా తొలిసారిగా కేక్​ తయారుచేసినట్లు తెలిపాడు కోహ్లీ. ‘ఈ కేక్​ నాకు చాలా బాగా నచ్చింది.. నాకెంతో ప్రత్యేకమైనది’ అని అనుష్క అతడితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.

virat kohil

ఆ సందర్భం లాక్​డౌన్​ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని తన మనసులో మాట చెప్పాడు.దీంతోపాటు ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్​, బల్గేరియన్​ స్క్వాడ్ వంటి ఎక్స్​ర్​సైజ్​లు చేయడానికి ఎక్కువ ఇష్టపడడని చెప్పాడు. పవర్​ స్నాచ్​ కసరత్తు చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బెండకాయతో చేసిన లహ్​సునీ పాలక్​ వంటకాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version