వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా.. కాంగ్రెస్ పై కేటీఆర్ పైర్

-

తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు..తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు..సింగరేణి కార్మికులపై అభిమానం లేదు.. ఇద్దరికీ పట్టలేనంత సంతోషం..మాటల్లో చెప్పలేనంత ఆనందం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే నిదర్శనమని ఆయన ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం..వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి..వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి..పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులా..?సిరుల గనికి మరణశాసనం రాస్తూ… చిద్విలాసమా ?వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ?ఈ “వేలం” వెర్రి నిర్ణయాల నుంచి.. తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకేనా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఈ ఫిరాయింపులు ? అని మండిపడ్డారు.ఆరునెలలైనా గ్యారెంటీలు అమలుచేయలేని.. అసమర్థత నుంచి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైంది.బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైంది .మీ రెండు జాతీయ పార్టీలకు వేసిన ఓటు..తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు..సంక్షేమానికి పాతరేసి.. అభివృద్ధిని పాతాళానికి తొక్కేసి..ఇద్దరూ ఆడుతున్న వికృతక్రీడ ఇది తొమ్మిదేళ్లు కంటికి రెప్పలా కాపాడిన.. తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు..కాంగ్రెస్, బీజేపీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదు అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version