వర్షంలో కూడా ఆందోళన చేపట్టిన డీఎస్సీ అభ్యర్థులు

-

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులు…వర్షంలో కూడా ఆందోళన చేపట్టారు. దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్లకార్డులతో డీఎస్సీ పోస్టుపోన్ చేయాలని వర్షంలో నిరసన వ్యక్తం చేసారు డీఎస్సీ అభ్యర్థులు. మంత్రులతో మాట్లాడమని చెప్తున్నారు కాని ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

DSC candidates who protested even in the rain

మీరు ఎవరెవరో మాటలు విని తప్పుదోవ పడుతున్నారు దయ చేసి స్టూడెంట్స్ తో మాట్లాడండని అంటున్నారు నిరుద్యోగులు. అటు గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన పైన స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తెలంగాణ యువతను కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతి రేకంగా రెచ్చగొట్టారు.. అరచేతిలో వైకుంఠం చూపించారని ఆగ్రహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీరి మోస పూరిత మాటలు నమ్మిన నిరుద్యోగుల వలన ఆ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version