ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్‌

-

రిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహారథులు, సినీ తారలు, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఈ వేడుక అట్టహాసంగా జరిగింది.

అయితే హై సెక్యూరిటీ ఉన్న ఈ వేడుకకు ఇద్దరు అనుకోని అతిథులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్‌ వెంకటేశ్‌ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకొంటున్న షఫీ షేక్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు వెల్లడించారు. అయినా, చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక అనంత్ – రాధికల పోస్ట్ వెడ్డింగ్ వేడుకలు లండన్ లో నిర్వహించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version